పుట:భాస్కరరామాయణము.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

జగతీనాథునితోడ నాడిన ప్రతిజ్ఞావాక్యముం జేసి స
త్యగరిష్ఠుండవు గమ్ము రాఘవునమోఘాస్త్రంబులం ద్రెళ్లి వే
గ గతప్రాణుఁడ వై మహోగ్రయమలోకం బేఁగి యచ్చోటఁ బ్రే
తగతిం బొందినవాలిఁ జూడకు సముద్యద్బుద్ధిహీనుండ వై.

480


క.

నీచేసినయవమానము, నాచిత్తములోన నసహనం బై పై పై
నేచుచునున్నది పున్నమ, వీచులచేఁ బొంగు జలధివిధమున నీచా.

481


క.

అత్యుపకృతిరహితుండ వ, సత్యుఁడ వకృతజ్ఞమతి వసఖ్యుండ వస
త్ప్రత్యయయుతుఁడవు స్త్రీసాం, గత్యవ్యసనుఁడ వపుణ్యకర్ముఁడవు కపీ.

482


వ.

కావున నాబాణంబులం దునిమి ని న్నిపుడ యమలోకంబున కనిచెద నని రోషా
వేశంబునం బలుకుచున్నసమయంబున.

483

తార లక్ష్మణునకుఁ గోపోపశమనంబు సేయుట

క.

తారానిభతారాంచిత, [1]హారిణి తారాభరదన యకలంకలస
త్తారాధిపసదృశానన, తారాసతి యనియె నపుడు తారాసుతుతోన్.

484


చ.

తరణిసుతుండు లక్ష్మణ కృతఘ్నుఁడు గాఁ డనృతుండు గాఁడు దు
శ్చరితుఁడు గాఁ డవజ్ఞుఁడు నృశంసుఁడుఁ గాఁడు కృతోపకారవి
స్మరణయుతుండు గాఁడు నృపుసత్తమునాజ్ఞకుఁ దప్పఁ డేల యీ
పరుసపుమాట లాడె దిటు బంధురకోపము డింపు లక్ష్మణా.

485


క.

ఈరాజ్యముఁ గిష్కింధము, నీరుమతోఁ గూడ నన్ను నీమణికనకో
దారధనధాన్యలక్ష్ములు, నీరవిజున కిచ్చినారు లెలమిన్ మీరల్.

486


క.

మీ పెట్టిన చె ట్టినజుఁడు, మీపం పొనరింపఁగలఁడు మిత్రత నెరయన్
వే పుచ్చినాఁడు సకలది, శాపథములకుఁ గపిపతుల జయ్యనఁ జేరన్.

487


క.

ఇనజుఁడు మీతోఁబుట్టువు, జనపతి కెంతయుఁ బ్రియుండు సంపూజ్యుఁడు రా
మునకును గపిబలములతో, ఘనతరసాహాయ్యకంబు గావించుఁ దగన్.

488


క.

ఆర్యుఁడవు ధర్మపరుఁడవు, గార్యజ్ఞుఁడ వీవు దప్పు గానక సఖునిన్
సూర్యసుతు మాన్యుఁ జనునె య, వార్యక్రోధమునఁ బరుషవాక్యము లాడన్.

489


క.

యతి యగువిశ్వామిత్రుఁడు, మతి చెడి మేనకకుఁ జిక్కి మన్మథలీలా
రతుఁ డై యుండఁడె పదియేం, డ్లితరుఁడు కార్యంబు నెఱుఁగ నేగతి నేర్చున్.

490


వ.

వినుము లక్ష్మణా దురాత్ముం డైనరావణున కపారసత్త్వసంపన్నులుఁ గామరూపు
లు నైనరాక్షసవీరులు దశకోటిసహస్రంబులు షట్త్రింశదయుతంబులుఁ గల రా
రక్కసుల నసహాయులై గెలువ నశక్యంబు గాన యతిబలు లైనవానరకోట్లతోడ
సుగ్రీవుండు రామునకు సహాయుం డయి లంకపై దండెత్తిపోవుతలంవున సముద్ర
పర్యంతభూమివనచరుల సాగరద్వీపవాసు లైనఋక్షకోటిసహస్రంబులఁ దో

  1. తారాభనయనమనోజ్ఞతారావిలస, త్తారా