పుట:భాస్కరరామాయణము.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని సుషేణుండు ప్రియంబులాడె నట దక్షిణదిగ్భాగంబునకుంబోయిన వానరులు.

625


క.

తారాంగదాదివానరవీరులు వాయుతనయుండు వింధ్యాద్రికి నే
పారఁ జని యచటిగిరిబిల, భూరుహషండవనకుంజపుంజాపగలన్.

626


క.

కలయ సతి వెదకి కానక, ఫలజలమూలోపభోగరపరు లై కపివీ
రులు చని యొండొకదేశము, నలవడఁ బొడగాంచి యలరి యచ్చటఁ జూడన్.

627


తే.

లీలమైఁ బదియేఁడులబాలుఁ డైన, తనసుతుఁ డరణ్యమునకును జని గతాసుఁ
డైనఁ దండ్రి యౌమునివరుఁ డాగ్రహమున, నావనము శపియించిన నావనంబు.

628


చ.

అలికులపర్ణహీనవికచాంబుజవారిరుహాకరంబు ని
ర్దళఫలపుష్పవృక్షనికరంబును నిర్గతజీవనాపగా
వలికలితంబుఁ బక్షిమృగవర్జితముం జ్యుతమూలమున్ ఘనా
చలగహనంబు నిర్జలముఁ జక్షురసహ్యము నై వెలుంగఁగన్.

629


చ.

అటఁ బరికించి యొక్కకనకాచలముం గని తద్బిలంబు ను
ద్భటగతిఁ జొచ్చి యందు ఘనపర్వతసన్నిభుఁ డైనదైత్యు ముం
గటఁ బొడగాంచి యయ్యసుర దాఁటి సమస్తగుహాంతరంబు వి
స్ఫుటముగ నందఱున్ వెదకి భూమిజఁ గానక దుఃఖితాత్ము లై.

630


సీ.

అటఁ బాసి కపు లొక్కవిటపిమూలముఁ జేరి, యాసీను లై యుండు నపుడు వారి
కనిలజుఁ డిట్లను నినజుండు చెప్పిన, చోటులఁ జెప్పనిచోటులందు
వెదకితి మెచ్చోట విభుదేవి గాన మ, వ్వనజాక్షివార్తయు వినఁగఁబడదు
సమయకాలంబును జనఁజొచ్చెఁ గడముట్ట, నిఁకమీఁదఁ జేయంగ నేమి గలదు
రామచంద్రుని కామితార్థంబు గలుగఁ, జేసి యానందకీర్తులఁ జెందలేదు
గాన ప్రాణంబు విడిచెదఁ గాక యన్న, నంగదుఁడు పావనికి నిట్టు లనియెఁ బొసఁగ.

631


చ.

అమితబలాఢ్యు లిండఱు సమర్థులు నెంతటి కైన రామభూ
రమణునికామితార్ధము పరాభవ మొందదు సర్వవానరుల్
క్రమముస నెల్లచో వెదకఁగాఁ దగుఁ గ్రమ్మఱ యుక్తకార్యయ
త్నము ఫలియించు నొక్కయెడఁ దక్కక చేయఁగ వంత యేటికిన్.

632


చ.

పతిహితకార్యముం జెఱిచి పందల మై భయలజ్జ లేది యే
గతి దివసేంద్రనందనునిఁ గానఁగఁ బోదము పోయినప్పు డు
ద్ధతి నతఁ డాత్మనాథు ప్రియ మాఱడిఁ బుచ్చిన యట్టినీచు లం
చతిభయదక్రియ మనల నందఱ వధ్యులఁ జేయకుండునే.

633


వ.

అనవుడు గంధమాదనుఁ డంగదుండు చెప్పినట్ల మన మెల్లచోటుల వెదకుదము
పదం డనుచు నట లేచి యందఱుం గూడి దక్షిణదిగ్భాగంబున నున్న వింధ్యాద్రి
సమీపంబుఁ జేరి.

634


మ.

విలసల్లోధ్రకసప్తపర్ణగహనన్ వీతప్రభావిస్ఫుర