పుట:భాస్కరరామాయణము.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అదియుం జతుర్విధభూతసృష్టితోడ నచట వర్తిల్లుట దాని మనుస్థానం బండ్రు
దేవదానవుల కది దుర్గమం బాశైలం బన్యులకు గమింప నశక్యంబు కపులార
మీ రాసోమాద్రి వీక్షించి తదీయపార్శ్వకటకగుహావనోద్యానవనగంధర్వభవ
నంబుల రామదేవుదేవిని వెదకి యటమీఁద శమీస్థానంబు నొంది మఱి యమ
కారులు మహోలూఖలమేఖలులు నగురాక్షసులు గల రారాక్షసులఁ గలసి
యేకరాత్రం బక్కడ నుండి యెల్లచోట్ల రామునిసతి వెదకుండు మఱియును.

597


మ.

అటపై నేరికిఁ బోవరా దినరుచుల్ వ్యాపింప వెల్లప్పుడున్
స్ఫుటమర్యాద మమందసాంద్రతిమిరస్తోమప్రకీర్ణంబు మీ
రట నేఁ జెప్పినచోటుల జనకజన్ వ్యక్తంబుగాఁ జూచి మ
ర్కటవీరుల్ నెలలోన రం డతికృతార్థత్వంబు సొంపారఁగన్.

598


క.

నెలలోన రానివాని, న్బలువిడిఁ జంపింతుఁ బూని నాహితమును భూ
లలనునిహితముం జేసిన, యలఘున్ రక్షింతు రాజ్య మంతయు నిత్తున్.

599


క.

నావుడు నవుఁ గా కని సు, గ్రీవునకును రామనృపతికిని మ్రొక్కి లస
ద్భావన శతబలి కపిసే, నావృతుఁ డై యుత్తరమున కరిగెం గడిమిన్.

600


వ.

అప్పు డొక్కవనచరుం డి ట్లనియె.

601


క.

మృత్యుముఖంబునఁ దక్కఁగ, క్షిత్యాత్మజ యెచట నున్న జెచ్చెర లోక
ప్రత్యయము గాఁగఁ దెచ్చెద, నత్యంతబలంబుతోడ నార్యులు మెచ్చన్.

602


వ.

మఱియొక్క వానరుం డి ట్లనియె.

603


క.

వినుఁ డే నిప్పుడ శతయో, జనముల్ చని కార్యసిద్ధిసహితుఁడ నై వే
చనుదేరఁగఁ గల నేటికి, వనచరులను దుఃఖపఱుప వనచరపతికిన్.

604


వ.

మఱియొక్కయగచరుం డి ట్లనియె.

605


క.

భూతలభూధరసాగర, పాతాళనదీవిపిననభంబులు నాయ
త్యాతతగమనత్వరకు వి, ఘాతంబులు సేయ లేవు కావున బలిమిన్.

606


క.

ఏవలన నున్న నైనను, రావణుఁ బరిమార్చి విజయరమ్యశ్రీతో
భూవల్లభుప్రియపత్నిన్, వేవే కొనివత్తు నేన విక్రమ మెసఁగన్.

607


వ.

మఱియొక్కవృక్షచరుం డేపున గంతులు వైచుచు ని ట్లనియె.

608


చ.

గిరు లగలించెదన్ జముని గెల్చెద బాడబవహ్ని మ్రింగెదన్
ధర విదళించెదన్ దెసలు దాఁటెద సాగరముల్ గలంచెదన్
ఖరకరచంద్రతారకనికాయముఁ గూల్చెద లీలఁ బంక్తికం
ధరుఁ బరిమార్చెదం గడిమిఁ దత్పురిఁ జొచ్చెద సీతఁ దెచ్చెదన్.

609


వ.

అని యివ్విధంబున మఱియు ననేకప్రకారంబుల దర్పంబులు పలుకుచు.

610


ఉ.

వాలము లెత్తి త్రిప్పుచును వావిరి గంతులు వైచుచున్ దెసల్
వ్రీలఁగఁ జేయుచున్ నెగసి వి న్నటు ముట్టఁగ మ్రొగ్గుచున్ ఘన