పుట:భాస్కరరామాయణము.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాలవనంబులం జూచుచు నటమీఁద.

554


మ.

మలయగ్రావమునందు భానుసమరమ్యస్ఫారతేజస్సము
జ్జ్వలుఁ డై యున్నయగస్త్యతాపసుని నిచ్చం జూచి యాశైలముం
గలయం జుట్టి ప్రసూనమాలికగతిం గావేరి యొప్పారెడున్
నలి నాపొంతఁ బులస్త్యుఁ డుండు నతని న్మానొంద వీక్షించుచున్.

555


వ.

ఆకావేరి దాఁటి సముద్రమర్యాద యగువేల చేరి యచ్చటఁ గేతకీపున్నాగవనం
బుల నవలోకించుచు నావేల యతిక్రమించి ముక్తామణిభూషితంబును గవాట
గుప్తంబును నగు పాండ్యుల హేమపురంబున కరిగి యప్పురంబుఁ జూచుచుఁ దద
నంతరంబ.

556


సీ.

ఘనుఁ డగస్త్యుండు పెట్టిన యుపహారమ్ము, గడఁగి రంగత్తరంగములచేత
వితథంబు చేసిన మతి నల్గి యమ్ముని, యంతరంగుఁడవు గమ్మని శపింప
నాశాపమున వార్ధి యంతరంగం బెల్ల, నపుడు గానఁగరాఁగ నంతరంగుఁ
డై యుండె నది మొదల దేశ మంతరం, గాఖ్య మా రూఢిచే నచ్చోటు గడచి
జాతరూపశృంగము సిద్ధ[1]సాధ్యచార, ణాప్సరోగణసేవ్యంబు నగుమహేంద్ర
గిరికి నరుగుఁ డయ్యద్రికి సురవిభుండు వరుసఁ బర్వపర్వంబుల వచ్చుచుండు.

557


వ.

ఆపర్వతంబునం దప్రమత్తుల రై సీతను వెదకి యాగిరిపాదంబున శతయోజనా
యతం బగుద్వీపము గల దది మనుష్యుల కగమ్యం బని యచటివనగోచరులు
చెప్పుదు రాద్వీపంబునం సీతం గలయ వెదకి యాద్వీపంబు గడచి సాగరోస్థితం
బును జంద్రసూర్యసంకాశంబును సాగరాంబుపరిఖంబును నంబరోల్లేఖిశిఖరం
బును నగు కనకగిరి గని యాశైలశృంగంబుల నొక్కహేమశిఖరంబున సూర్యుం
డును మఱియొక్కరజతమయం బైనశిఖరంబునఁ జంద్రుండును వెలుంగుచుండు
దురు కృతఘ్నులు నృశంసులుఁ బాపకర్ములు నాశైలంబును గనలే రగ్గిరికి నమ
స్కరించి సీత నందు శోధించి యగ్గిరి గడచి చతుర్దశయోజన పరిమితం బగుసము
ద్రాపరభాగంబున కరిగి యచట ఫలమూలాంబుమధువులు తనియ సేవించి
యాసాగరంబు దాఁటి సర్వకాలఫలదళవృక్షంబులు గలిగి విశ్వకర్మనిర్మితం
బైనవిద్యుద్వంతం బనుపర్వతంబు గల దచటి కరిగి యందు సీతారావణుల వెదకి
మఱియు జాతరూపశృంగనానాధాతుశోభితం బైనయుశీరబీజం బనుపర్వతంబు
పొడ గనుం డప్పర్వతంబు మరణాసన్నకాలు రైనవారికిఁ గానంబడ దన్నగంబు
శృంగంబుల సీత వెదకి యన్నగం బతిక్రమించి దుర్దర్శనం బగుమాల్యవంతంబు
గని యటకుఁ జతుర్దశయోజనమాత్రంబున శక్రధ్వజాకారం బగుకుంజరపర్వ
తంబు గల దగ్గిరియందు విశ్వకర్మనిర్మితం బగునగస్త్యభవనం బున్నది యక్కడ
నగస్త్యాభిషేకంబుకొఱకు నోషధివనశైవలినీశోభిత యైనయంజనానది యున్నది

  1. చారణామ, రాప్సరోగణ