పుట:భాస్కరరామాయణము.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యం బై విలసిల్లు నందు వైఖానసు లైనవాలఖిల్యులు సూర్యకిరణాహారు లై
ప్రాదేశప్రమాణు లై యుండుదు రట మేరువు సూర్యప్రభలు సంక్రమింప సం
ధ్యారక్తవర్ణం బై యుండు నచ్చోటఁ ద్రివిక్రమదేవుండు ప్రథమపాదంబు పెట్టి
ద్వితీయపాదంబు మేరుశిఖరంబునం బెట్టె నామేరుశిఖరంబు నాక్రమించి సూ
ర్యుండు తేజరిల్లుచు జంబూద్వీపంబువారి కెల్లఁ గానంబడుచు సకలజీవులకుఁ
గన్నులవెలుంగై యుండుఁ దత్పూర్వభాగం బెల్ల నంధకారావృతంబై యుండు
నటమీఁద మీకు గమింప నశక్యం బాశైలవనస్థలనదీప్రదేశంబుల సీతారావ
ణుల శోధింపుఁ డని పలికి.

548


మ.

ఇట నేఁ జెప్పిన చండభానుకిరణాన్వీతాఖిలక్షోణులం
బటుబుద్ధిన్ మఱి మీకుఁ జెప్పనిమహీభాగంబులం బోల మ
ర్కటవీరుల్ చని జానకి వెదకి వే రం డొక్కమాసంబులో
నటమీఁదం దడ వున్నవాని వెసఁ జెండాడించి చంపించెదన్.

549


చ.

వనచరవీరులార రఘువల్లభువల్లభ వేగ చూచి వ
చ్చినకపివీరసింహునకుఁ జెచ్చెర నాసగరాజ్య మిచ్చెదన్
జనపతికోర్కి సేయుట యశంబును బ్రాణపదంబు ధర్మవ
ర్తనము నవశ్యకార్యమును దద్దయు లోకహితంబు వెండియున్.

550


క.

మన కెల్ల బ్రదుకుఁదెరువును, మనమున కెంతయుఁ బ్రియంబు మర్కటవీరుల్
ఘనసత్త్వజవము లారం, జని వైదేహిఁ గని రండు సమ్మద మొదవన్.

551


వ.

అని పలికి వినతప్రముఖులఁ దూర్పుదిక్కునకుం బనిచి దక్షిణదిగ్దేశంబునకుఁ దగు
వారిం బుచ్చుతలంపున.

552

హనుమంతుండు మొదలగువానరుల దక్షిణదిక్కునకుఁ బుచ్చుట

మ.

అనిలతనూజునిన్ గజగఁవాక్షుల మైందసుహోత్రగంధమా
దనుల నుదారునిన్ ద్వివిదు ధాతృసుతుం డగు జాంబవంతునిన్
వినతుని నంగదప్రముఖవీరుల నగ్నితనూజు నీలునిం
గనుఁగొని భానునందనుఁడు కార్యము చొప్పడ వారి కి ట్లనున్.

553


వ.

అతిబలులు సర్వకార్యనిర్వాహకులు నైనకపివీరులారా మీరు దక్షిణదిగ్భాగం
బున కరిగి యచట నచట సీతారావణుల వెదకుచు సహస్రశృంగం బగువింధ్యం
బున కేఁగి నర్మదావేత్రవతీతీరంబుల నావింధ్యపాదవనదుర్గగుహల జానకిని వెదకి
వేగవతీకృష్ణవేణీదేవికామేఖలోత్కలాకంబువతీంద్రవతీసమీపంబుల విదర్భర్షికా
మాహిష్మతీపట్టణంబుల శకపుళిందనిషధదశార్ణకుకురాదిదేశవనగిరికందరంబుల
సీత వెదకుచు దండకారణ్యంబున కరిగి యచట గిరివనదుర్గంబులు గోదావరీతీరం
బుల నంధ్రపుండ్రకేరళకురుదేశంబులఁ బరికించుచుఁ జిత్రపుష్పితపాదపచందన
వనశోభితం బై నమలయపర్వతంబునకుం జని యాపర్వతకందరచందనషండత