పుట:భాస్కరరామాయణము.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు ప్రయాణభేరులు వేయించి తారాదికాంతల నంతఃపురంబున కనిచి సౌ
మిత్రి కుచితసత్కృతు లొనరించి వానరులచే నొక్కమణిశిబికం దెప్పించి ముంద
టం బెట్టించి చేతులు మొగిచికొని రామభూవిభుఁ గొలువం బోదము శిబిక
యెక్కు మని ప్రార్థించిన.

523


మ.

మణిరాజచ్ఛిబికాధిరూఢుఁ డయి రమ్యచ్ఛత్రముల్ పట్ట నీ
క్షణభద్రామలచామరంబు లిడ శంఖస్ఫారభేరీసము
ల్బణరావంబులు పెల్లుగా మొరయఁ బైపై వందిసందోహముల్
ప్రణతుల్ సేయఁగ లక్ష్మణుం డరిగె నారామప్రభుం గానఁగాన్.

524


చ.

ఇనతనయుండు దాను నొకహేమలసచ్ఛిబికాధిరూఢుఁ డై
సునిశితశస్త్రపాణు లొగి సూరెలఁ గొల్వఁగ శంఖదుందుభి
స్వనములు దిక్కులం జెలఁగ సైన్యపదాహతులన్ సమస్తమే
దినియుఁ జలింప రామజగతీపతిపాలికి నేఁగె సమ్మతిన్.

525


వ.

ఇ ట్లరిగి మాల్యవంతంబు చేరి యనతిదూరంబున.

526


క.

లక్ష్మణరవిజులు [1]శిబికలు, సూక్ష్మత్వర డిగ్గి వినయశోభితు లై రా
బక్ష్మలితాక్షుం డై రా, మక్ష్మాపతి వారి జూచె మచ్చికతోడన్.

527


చ.

తరణిసుతుండు రామవిభు దవ్వులఁ గన్లొని హ స్తపద్మముల్
శిరమునఁ జేర్చి మ్రొక్కుచును జేరఁగ వచ్చి సమగ్రభక్తితో
ధరపయిఁ జక్కఁ జాఁగిపడి దండము పెట్టినఁ గేల నెత్తి భూ
వరుఁడు కవుంగిలించెఁ గపివల్లభునుల్లము పల్లవింపఁగన్.

528


వ.

అట్లు గారవించి కృతాంజలు లై ముందట నిలిచియున్న సుగ్రీవునిం దక్కినవన
చరవీరులం గూర్చుండ నియోగించి యాసీనుం డైనసుగ్రీవునిం జూచి ప్రణయ
కోపావేశంబున ని ట్లనియె.

529


క.

సతతము ధర్మార్థార్జన, రతుఁ డయ్యును విహితసమయర్తక్తిం గామో
చితములు సల్పెడు జనపతి, యతులితరాజ్యంబు నొంద నర్హుం డెందున్.

530


క.

సురుచిరధర్మం బెప్పుడుఁ, బరికింపక నీవు కామపరతంత్రుఁడ వై
తరుణీసంగతి నుండఁగ, మరగి ననుం జెలిమిఁ జేర మఱచితి మదిలోన్.

531


క.

ఏ నిన్నుఁ బిలువఁ బంచిన, మానుగ నీబ్రదుకుకొఱకు మఱి వచ్చి తిటం
గాని తగుమైత్రి నెఱయన్, జానుగ నీయంత రావు చనునే చెపుమా.

532


క.

లంకన్ రావణుఁడు నిరా, తంకంబుగ సీత దాఁచి తా నున్నాఁ డా
వంకం జానకి వెదక న, శంకితు లగుకపులఁ బనుపు చయ్యన నింకన్.

533


అన విని క్షానుసూనుఁడు కృతాంజలి యై ప్రణమిల్లి యాత్మలో
నెనసినభీతిఁ బో విడిచి యెంతయు సంతస మంది యి ట్లనున్

  1. శిబికల, సూక్ష్మత్వర లుడిగి వినయ.......బక్ష్మావిలాక్షుఁ డై