38
కున్నారు. పోలీసులు నిద్ర దులుపుకొవి చెట్టును ముట్టడి వేసినారు, కొరవలు తుప్పు తుప్పున చెట్లపైని మంచెలమిది నుండి క్రిందికి దుమికినారు. కొందరు దొరకినారు. కొందరు పెనుగులాడి తప్పించుకొని పోయినారు. పట్టుబడిన వారిలో మన గుజుగ భీముడును, వాని కొడుకగు మూగిదొంగయు నుండిరి. ఈ మూగిదొంగ యిదివరలో పండితుడైన వాడే కొన్ని దినాలకు ముందు వెంకోబరావుకు 300 రూపాయల లంచమిచ్చి సిఫారసు పొంది తప్పించుకొన్న వాడే! దానికి ప్రత్యుపకారముగా వెంకోబ రావు, ఇంటిలో 5- 6 వేల ధనము దోచుకొని పోయియుండెను. ఇప్పుడు పట్టు బడినప్పుడు వెంకోజరావు యొక్క దుస్తులనే ధరించియుండెను. కొరవలు చాల మొండి దొంగలు. రాజానాయకు కూడ ఘోరాతి ఘోరుడు. వారిని చావకుండి నా నావిధముల' హింసించినాడు. తలక్రిందుగా వేలాడగట్టి క్రింద నీటితోట్లలో తలలుముంచి లేవ నెత్తుచు పీడించినాడు. వేకటరామా రెడ్డి గారికీ దృశ్య ములు ఘోరమనిపించి తన మొహిరిర్ ను మందలించినాడు. కాని అన్నిటికి మొహిరి రేకదా ఉత్తరవాది! “ఉండవయ్యా. మీరు చూస్తుండండి యీ తమాషాలంతా" అనేవాడు. మొహరిర్ ఇంకొక యుక్తి పన్నినాడు, ఆ కొరవలవారి ఒక యువతిని పరిచయము చేసికొని దానికి ప్రియుడైనాడు. ఇద్దరును