ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రాజా బహద్దరు వేంకట రామా రెడ్డి ఓ. బి. ఇ. గారికి
శ్రీవారి జన్మదినోత్సవ సందర్భమున
ప్రాతవిద్యార్థినీ సంఘము సమర్పించు
సన్మాన పత్రము
మమళయా!
నేను సుదినము. లోక కల్యాణార్ధమై మహాత్ము లుదయించుచుందురు. క్షణ భంగురములగు జీవితము లను కొందరు ఆదర్శ వంతముగఁ జేయుదురు. అట్టి యాదర్శ జీవుల పుట్టుం దినములు పుండుగలు. నేడు మాకు పండుగ. మీ పుత్రికలు జేసికొను పండుగ కాతిథ్యము స్వీకరించినందుకు వందనములు.
ఉదార చరితా!
విద్యాహీనమై, జడ మైయున్న స్త్రీలోక ముంజూచి కని కరించిన మహాయశో విభాసితులచే స్థాపింపఁ బడినట్టి, మా తృభాషా ద్వారా యున్న తవిద్యం గరఫుటయం దఖిలాంధ్ర
దేశమునకు మార్దర్శినియై, ఏటేట నెందజనో యుత్తమ గృహిణులుగాఁ జేసి దేశమున కర్పించుచున్న; ఈ పాఠశాల కధ్యక్షత వహించి సర్వవిధముల విద్యను ప్రోత్స హించు మీ యుదారచరిత యంతయుం శ్లాఘ్యము.