Jump to content

పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149


హిందువులకు సముద్ర ప్రయాణమును మధ్యకాలములో నిషిద్ధము చేసినట్టి కొన్ని సూత్రములు బయలు దేరెను. ప్రాచీన కాలములో హిందువులు, అందు ప్రధానముగా ఆంధ్రులు ఖండఖండాంతరములకు సమగ్రముపై ప్రయాణముచేసి వ్యాపారము చేయుచుండిరి, మరియు నానా ద్వీపములలో వేదమత వ్యాప్తిని గావించి వలస రాజ్యములు స్థానించిరి. కులకట్టు బాటు విపరీతముగా ముదిరిరిన తర్వాత సముద్ర ప్రయాణము చేయగూడదని కొన్ని తప్పుడు శాస్త్రములు బయలు దేరెను. నిజాం రాష్ట్రములో రెడ్లును ఈ శాస్త్రబీతిచే తమపిల్లలను యూరోపు, అమెరికా ఖండములకు పంపుటకై జంకుచుండిరి. ఆ సందర్భములో నిజాం రాష్ట్రము లోని 'రెడ్లలో ప్రధమమున సముద్ర ప్రయాణమున కను కూలించిన వారు శ్రీ రెడ్డిగారును శ్రీయుత పింగిలి వేంకట రామా రెడ్డిగారును నైయున్నారు. శ్రీ రెడ్డి గారి కుమారులగు వేంకట లక్ష్మణ రెడ్డి గారును, పింగిలి వేంకట రామారెడ్డిగారి తమ్ములగు (శ్రీకృష్ణా రెడ్డిగారును. మరియు రాజగోపాల రెడ్డి ( బ్యాజిష్టరుగారను) మొట్టమొదట ఇంగ్లాండు దేశము సకు బారిస్టరీ చదువుటకుగాను సముద్ర ప్రయాణము చేసి వెళ్ళిరి.


వక్తృత్వ సామర్థ్యము


అనేక మంది అధికారులు తామెంత గొప్పవారైనను సభారంగము పై నిలిచినప్పుడు నోట తడిలేక మాటలేక