Jump to content

పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వా స ము.

165


వృషభహీనం బైనవిహ్వలత్వముఁ గాంచి
           కనుగని పరచు గోగణము భంగి
సురుచిరాకృతిఁ బొల్చు తరలరత్నము వీడి
           దొరఁగెడు ముత్తెంపుసరులరీతిఁ
గరచరణాంగరేఖావైఖరులు గల్గి
           శిరముఁ జెందని కళేబరముభంగిఁ


తే.

 జతురచతురంగనికరసంగతము నయ్యు
రాజమణి శూన్య మగుట నిస్తేజ మగుచుఁ
దన్మహారాజసైన్య మంతయును గదలి
వేగతరయానమునఁ జేరె విజయనగరి.

270


శా.

 గంధాంధద్విపమండలంబులు మొద ల్గా తద్ధరిత్రీభుజ
స్కంధావారము చూఱగొన్న తుద మూసాబూసికీరావుసం
బంధుం డొక్కరుఁ డేగుదెంచి బలిమిం బై వ్రాలి రాజన్యహృ
ద్గ్రంథిచ్ఛేదన మాచరించె నను వార్త ల్వచ్చుచో నత్తఱిన్.

271


చ.

 వెలమలసాహనం బమరవీరులయందు సురేంద్రనందనా
దులయెడ నైనఁ గాన మని తోరపుటక్కజ మంది యందిపై
నలఘుపరాక్రమాతిశయుఁడై దగు తాండ్రకులాగ్రగణ్యుదో
ర్బలము నుతించె బూసి బహుభంగులఁ దత్కృత మాత్మ మెచ్చుచున్.

272


శా.

ఎన్న న్రాని మహాభిమానినిధులౌ యీవెల్మవా రింటిపై
కెన్నండు న్వినలేని కృత్యమున కి ట్లేతెంచు రాజన్యుపా
పౌన్నత్యంబునఁ దాండ్రపాపనృపవర్యాకారత న్మృత్యు వా
సన్నంబై తెగటార్చె దుష్కృతి ననిష్టప్రాప్తి గాకుండునే.

273