Jump to content

పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృ తీ యా శ్వా స ము.

157


నివ్వెరపడంగ వలువదు నవ్వుగాదు
దీప మింతైన బొలుపదే తిమిరహృతికి.

233


ఉ.

 ఆరణమధ్యసీమ హతులైన బలంబులు నిందు నందు వే
ర్వేర వచింప నేల పటువిక్రమధుర్యులు రావువారిలో
వారల రందరున్ యవనవర్గములో గజరాజసంగతం
బై రహి నొక్కలక్ష పడి రందుల నొక్కొకరుండు దక్కఁగన్.

234


వ.

 అప్పు డయ్యవనశిబిరంబు గ్రందుకొని.

235


సీ.

 వాజిశాలలు రిక్తవాహంబు లగుటయు
       నదరురాహుత్రుల రొదలుకతన
నాలానముల వారణావలిఁ గానని
       హస్తిపకుల యంగలార్పుకతన
భర్తృజామాతృసౌభ్రాత్రాదు లాజిలో
       వ్రాలుట కొఱలు బిబ్బీలకతన
రహితాప్తవర్గమై బహువిలాపమ్ములఁ
       బొరలు సైనికసముత్కరముకతన


తే.

నొంచి కాకు వహించి యత్యుగ్రుఁ డగుచుఁ
దడయ కేతెంచి యప్పు డుద్ధతులముల్కు
చాల నిందించె హైదరుజంగుఁ బిలిచి
యిట్టిదురవస్థ నినుఁ గూర్చి పుట్టె ననుచు.

236


ఉ.

 బొబ్బిలివారితో మనకు బొం దుచితం బని మున్గు మందరుం
డుబ్బి లిఖించె నాతనిహితోక్తి గ్రహింపక జిడ్డు దెచ్చి పై
నబ్బురు మైనికిల్బిషపుటంబుధి ముంచితి వింతవట్టు నీ
కబ్బదె కొద్దినాళ్ల కహహా యిఁకఁ జేసినయంతఁ దప్పకన్.

237