పుట:భాస్కరరామాయణము.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నదిని సకలదేవమునీంద్రులు సన్నుతింతురు పుణ్య మైన కౌశికానదియును నచట
విలసిల్లు మఱియు రక్తజలప్రవాహయుఁ గేశమాంసాస్థినాలుకయు నైనవైతర
ణియుఁ దత్సమీపంబునఁ బాఱుచున్నది యచ్చట యక్షగంధర్వపిశాచోరగపతం
గాదులు కాలవశంబున దేహంబులు విడుచుచుందు రచ్చట వారిదేహంబులు
గానంబడు భువి మనుష్యులదేహంబులుంబోలె నటఁ గడచి కాలమేఘసంకాశం
బును ఘోరగ్రాహసంకులంబు నగునుత్తరసముద్రంబున కేఁగి తదుత్తరతీరంబు
చేరి కొండొకసేపు విశ్రమించి తత్తీరంబున నున్నసహస్రశిఖరాయతంబును గాం
చనమయంబును సూర్యసంకాశంబును నగుబహుకేతుపర్వతంబు గని యాగిరి
మీఁద నున్నదివ్యప్రసన్నోదకహ్రదంబును మహాశరవణంబునుం గని కాంచన
మయం బైనయాశరవణంబు చేరి.

584


తే.

కాలమేఘసంకాశంబు గ్రాహభీక, రంబు బహురత్న రాజవిరాజితంబు
నైనయుత్తరవారాశి కరిగి యుత్త, రంపుఁదీరంబుఁ జేరి విశ్రామ మొంది.

585

,

చ.

అలరి యటన్ సహస్రశిఖరావళి కాంచనదీప్తమండలిన్
గలబహుకేతునామగిరి గ్రాలుచు నుండును దానిమీఁద ని
ర్మలసలిలహ్రదం బమరు మానుగ నచ్చటఁ గార్తికేయజ
[1]న్మలలితదీప్తిమచ్ఛరవణంబు వెలుంగుఁ దదీయసన్నిధిన్.

586


క.

సలిలాశయ మొక టిరవుగఁ, గలదు హయగ్రీవుఁ డయిన కపిలుఁ డనంతుం
డెలమిం దద్దీర్ఘికలో, నలవడ జలకేళిఁ దేలి యాడుచు నుండున్.

587


వ.

అగ్గిరిశృంగగుహానిర్ఝరంబుల సిద్ధచారణసేవితపుష్పితవనాశ్రమంబుల జనకజ
వెదకుచు నద్దేశంబు దాఁటి ముందట నున్నశిలోచ్చయనదిని దత్తీరకీచకవేణు
వులం దెప్పలు గట్టికొని యాపుణ్యనదీజలస్పర్శనంబు చేసి యానది నుత్తరించి
యావల సీతానదిఁ బొడగని యానది నవగాహంబు సేసి శుచీభూతు లై పుణ్యా
త్ము లగుచు నటఁ గడిచి.

588


క.

సురపురసదృశము లగును, త్తరకురుదేశములు గలవు తద్దేశములం
జరియించుజను లుదారులుఁ, దరుణవ యోలలితు లధికధన్యులు మఱియున్.

589


ఉ.

ఆగతహర్షభాగులు నిరంతరనిర్జరరాజభోగులుం
జాగులుఁ బుణ్యభాగులును శాశ్వతరాగులు [2]నిష్టసౌఖ్యసం
యోగులు నిర్గతాగులు సముజ్ఝితశోకభయార్తిరోగులున్
శ్రీగులు నిత్యదానరతిసేవితకందరకాంచనాగులున్.

590


వ.

ఆదేశంబున శీతోష్ణజరామరణంబులు శోకభయామర్షంబులు లేవు సూర్యుండు
ప్రసరింపఁడు భూమి వశీకరయు నిస్తృణకంటకయుఁ బాండువర్ణయు సమతలయు
విగతబాధయు నారోగ్యవతియు శాద్వలవతియు సర్వకాలఫలవృక్షశోభితయుఁ

  1. న్మలలితహేమతచ్ఛరవణంబు
  2. నిత్యసౌఖ్య